హన్మకొండ, జ్వాల: ప్రజల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండ 57 వ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. హన్మకొండ 57వ డివిజన్ లో గాంధీ నగర్ నుండి అశోక కాలనీ వరకు 7 లక్షల నిధులతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుబడిందని అన్నారు. వారు కేవలం ప్రచారా ఆర్భాటాలకే తప్ప అభివృద్ధి జరగలేదని..అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బంక సతీష్ యాదవ్, కార్పొరేటర్ నల్ల స్వరూప సుధాకర్ రెడ్డి , జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, సీనియర్ నాయకులు మండల సమ్మయ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు.