కరీంనగర్, జ్వాల: హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం సర్కారుకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన అమరవీరులు బద్దం ఎల్లారెడ్డి,రావి నారాయణరెడ్డి,అనభేరి ప్రభాకర్ రావు లాంటి మహనీయుల విగ్రహాలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని, అమరవీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,కసిరెడ్డి మణికంఠ రెడ్డి,నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్,గూడెం లక్ష్మి,అనభేరి ప్రభాకర్ రావు కుమార్తె విప్లవ కుమారి,సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు,కిన్నెర మల్లవ్వ,పైడిపెల్లి రాజు, రజిత,సుజాత,మల్లీశ్వరి,రాము పాల్గొన్నారు.
వీరుల చరితను పుస్తకాల్లో చేర్చాలి
Leave a comment