కరీంనగర్, జ్వాల :
అదేంటి.. గంప నెత్తిన ఎత్తుకుని కలెక్టరేట్ లోకి వెళ్తుంది అనుకుంటున్నారా.. అవును మీరు చదివింది నిజమే.. ఈ ఫోటోలో చూస్తుంది కూడా నిజమే. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన మహిళ పేరాల మానస రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీకి మంగళవారం నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ కు.. గంపకు ఏంటీ సంబంధం అనేకదా మీ సందేహం. అక్కడికే వస్తున్న. చిల్లర పైసలు ( ఐదు, పది రూపాయల బిళ్లలు) నామినేషన్ కు కావల్సిన రూ. 25వేలు చందాల రూపంలో జమ చేసింది. చందాలతో పాటు.. కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఉన్న సమస్యలను సైతం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను గంపలో వేసుకుంది. నేరుగా ఆ చిల్లర డబ్బులతోనే కలెక్టరేట్ కు వెళ్లి నామినేషన్ దాఖలు చేసింది. మార్పు కోసం మహిళగా తాను ఒక అడుగు ముందుకు వేశానని.. తనకు అందరు మద్దతు తెలపాలని ఆమె కోరారు. అర్కిటెక్చర్ గా, మంచి ఇంజరనీరు అయిన మానస రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని , వినూత్న ఆలోచనకు అందరు అభినందిస్తున్నారు.