వరంగల్, జ్వాల :
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జనగామ జిల్లాలోని
జఫర్ గడ్ మండలంలోని ఉప్పుగల్లు, తిమ్మంపేట గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసింది. అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి తోట రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామం లో నకిర్త యాదగిరి ఇట్టి దగ్గర ఉన్న కొబ్బరి చెట్టు మీద పిడుగు పడింది. చెట్టు మట్టలకు మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయాయి. వరంగల్ లోని హనుమకొండ, మడికొండలలో మోస్తారు వర్షం కురిసింది.
జోరుగా వర్షం.. తడిసిన ధాన్యం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
Leave a comment