హన్మకొండ, జ్వాల: హన్మకొండ జిల్లా సుబేదారి అనాధ ఆశ్రమ హాస్టల్ లో ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం సమావేశం అయ్యారు. పాఠశాలలో 1979–80 లో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు సుమారు 35ఏళ్ల తరువాత మొదటిసారిగా కలుసుకున్నారు. సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు తమ స్నేహితులతో కలిసి వచ్చి ఆప్యాయ పలకరింపులతో సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులను ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు. అనంతరం హాస్టల్ లో తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు.అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేసి అనంతరం తమ జ్ఞాపకాలను, అనుభవాలను కుటుంబ సభ్యుల పరిచయాలతో తమకున్న కాలాన్ని గడిపారు. ఈ సందర్బంగా వారు మట్లాడుతూ… తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక అనాధ ఆశ్రమ హాస్టల్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లో బండారి రవీందర్, శనిగారపు సురేష్, వెంకటేష్, రంజిత్ కుమార్, పి వెంకన్న, రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
హన్మకొండ జిల్లా సుబేదారి అనాథ ఆశ్రమ హాస్టల్ లో ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Leave a comment