– బండి సంజయ్ పై మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫైర్
కరీంనగర్, జ్వాల : బండి సంజయ్ అబద్దాలు చెప్పి ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తావని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. కరీంనగర్ కదనభేరి సభకు లక్షలాది గా తరలి వచ్చిన జనాన్ని చూసి బండి సంజయ్ కి దిమ్మతిరిగి మతిలేని మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. నువ్వు చేసిన అభివృద్ధి మీద బహిరంగ చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. సాగు నీళ్లు రైతులు కన్నీరు పెడుతున్న కూడా ఏ ఒక్క రైతునన్నా పరామర్శించావా అంటూ బండి సంజయ్ ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగు నీళ్లు ఇవ్వాలని అడిగావా అంటూ ప్రశ్నించారు. ఐదేళ్లలో నువ్వు కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తెచ్చావంటూ రవీందర్ బండిని ప్రశ్నించారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఊసరవెల్లి నాటకాలు చేస్తున్నావంటూ బండిని కడిగిపారేశారు. ఐదేళ్లలో కరీంనగర్ కు ఒక్క గుడి తెచ్చావా…ఒక్క నవోదయ బడి తెచ్చావా అంటూ రవీందర్ నిలదీశారు. ఎన్నికలు వస్తేనే నీకు ప్రజలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో నువ్వు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చావంటూ రవీందర్ బండిని దుమ్మెత్తి పోశారు.ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటమి తప్పదనే బురద రాజకీయాలు చేస్తున్నావంటూ రవీందర్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గుంజపడుగు హరి ప్రసాద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.