వరంగల్ క్రైమ్, జ్వాల: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ సీఐనీ అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రణీతరావు ఇచ్చిన సమాచారం మేరకు సదరు సీఐని విచారించి అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి పేరు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈయనకు అత్యంత సన్నిహితుడుగా వ్యవహరించిన సదరు సీఐ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అదుపులోకి తీసుకునీ విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఆరోపణలు ఉన్న మరో సిఐ నీ కూడా నేడో రేపో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
పోలీస్ అదుపులో ఆ సీఐ ..?
Leave a comment