హనుమకొండ, జ్వాల:
హనుమకొండ జయ కృష్ణ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో 20 24 సంవత్సర అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సామాజిక సేవకుడు పసులు రవికుమార్ కు సన్మానం చేశారు. మహిళా ఉత్తమ మహిళలకు, సేవా, కళా రంగంలో సేవలు చేసిన వారిని గుర్తించి విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏసీబీ ఏసీపీ కె విజయ్ కుమార్ చేతుల మీదుగా సన్మానం చేశారు. కరీంనగర్ పట్టణంకు చెందిన పసుల రవికుమార్ చేస్తున్న సేవలకు ట్రస్టు ప్రెసిడెంట్ అనుమండ్ల నాగరాజు గుర్తించారు. ఈ సన్మానం మరింత బాధ్యత పెంచిందని రవికుమార్ అన్నారు. మరిన్ని సేవలు చేస్తానని తెలిపారు.
congrats anna