భూపాలపల్లి, జ్వాల:
విద్యుత్ పరమైన ఎలాంటి సమస్యలు ఉన్నా మంగళవారం జరిగే కార్యక్రమంలో పరిష్కారించుకోవాలని మహాముత్తారం సబ్ ఇంజినీర్ వర్రె కొమురయ్య తెలిపారు. మహాముత్తారం సబ్ స్టేషన్ లో మంగళవారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. ఎన్ పీడీసీఎల్ ఆద్వర్యంలో నిర్వహించే ఈ వేదికను కాటారం, మహాముత్తారం, మహాదేవ్ పూర్, పలిమెల, కొయ్యూర్ సెక్షన్ల పరిధిలోని వినియోగదారులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. విద్యుత్ వినియోగదారులు ఎలాంటి సమస్యలున్నా అధికారుల వద్దకు తీసుకురావాలని కోరారు. ఇంట్లో మీటర్లు, బిల్లులు, బోరు మోటార్లకు కరెంట్ వైర్లు, పోల్స్.. ట్రాన్స్ పార్మర్ల సమస్యలు ఏవి ఉన్నా.. పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమానికి టీఎస్ ఎన్ పీడీసీఎల్ ఛైర్ పర్సన్ కె. తిరుమల రావు, మెంబర్ చరణ్ దాస్, నరేందర్ హాజరవుతారు.