పరకాల, జ్వాల: కంఠాత్మకూర్ వాగుపై రూ.10 కోట్లతో ఫోర్ లైన్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి గురువారం పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పరకాల రెండు జాతీయ రహదారులు కలుపుతూ వెళ్ళే రోడ్ కంఠాత్మకూర్ వద్ద వాగు వల్ల వర్షా కాలంలో రవాణ వ్యవస్థ దెబ్బతిని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పదుతున్నారని పేర్కొన్నారు. పరకాల ప్రాంత అభివృద్ధిని కోసం కంఠాత్మకూర్ వాగుపై రాబోయే 50 సంవత్సరాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాగుపై ఫోర్ లైన్ హైలెవల్ బ్రిడ్జి అవసరమని గుర్తించి అధికారులతో చర్చించి అందుకు అవసరమయ్యే నిధులు రూ.10 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి విజ్ఞప్తి చేయడం జరిగినదని వెంటనే వారు నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని ఆయన అన్నారు.
హై లెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన
Leave a comment