హైదరాబాద్, జ్వాల:
తన ఫ్రెండ్స్ పై పార్టీ మారమని ఒత్తిడి తెస్తున్నారని.. .ఎంత ఒత్తిడి తెచ్చిన తాను పార్టీ మారేది లేదని.. రాజశేఖర్ రెడ్డి హయంలో పార్టీ మారమని ఎంతో ఒత్తిడీ, కేసులు పెట్టారు అయినా మారలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. చరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని.. .తన మీదా చరణ్ చౌదరి ఆరోపణలు చేసి.. ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గతంలో బీజేపీలో ఉన్న శరణ్ కబ్జాలు చేయడంతో హైకమాండ్ సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. NRI వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసాలు చేస్తుంటడని అన్నారు. చరణ్ పై చాల కేసులు ఉన్నాయని.. దొంగ పత్రాలు పెట్టీ కబ్జాలు చేయటం ఆయనకు అలవాటన్నారు. 40 యేండ్ల పాటు రాజకీయాల్లో ఉంటున్న, తన పై ఎటువంటి మచ్చ లేదని… వాస్తవాలు తెలుసుకొని ప్రెస్ మిత్రులు వార్తలు రాయాలన్నారు. ప్రణిత్ రావు ఎవరో తనకు తెలియదన్నారు. కావాలని వర్ధన్నపేట నియోజకవర్గాని ఎస్పీ రిజర్వర్డ్ చేశారు. ఓటు నోటుకు కేసు … నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.