హైదరాబాద్, జ్వాల: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి తాజా పరిణామాలు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ని మల్లారెడ్డి, మరో నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిసినట్లు సమాచారం.బెంగళూరులోని ఓ హోటల్ లో డీకే శివకుమార్ తో మంతనాలు జరిపారు. కాంగ్రెస్లో చేరేందుకు ఇరువురు దాదాపు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరారు. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి ..?
Leave a comment