వరంగల్ క్రైమ్, జ్వాల:
హనుమకొండ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వడ్డేపల్లి క్రాస్ రోడ్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కాజీపేట నుంచి హనుమకొండ వైపు బైక్ మీద ఇద్దరు యువకులు వస్తున్నారు. అదే సమయంలో రెవెన్యూ కాలనీ నుండి వడ్డేపల్లి వైపు వెళుతుండగా.. ఈ కారును బైక్ ఢీకొట్టింది. యువకులు కారు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుoడగా మృతి చెందాడు, కాజీపేటకు చెందిన సయ్యద్ వహీద్, అశ్రఫ్ గా గుర్తించారు. ఈ ఘటనపై సుబేదారి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.