దేవరుప్పుల, జ్వాల: దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేస్తున్న పెద్ది క్రిష్ణమూర్తి గౌడ్ ను తొలగించడంపై కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఎందుకోసం తొలగించాల్సి వచ్చిందో చెప్పాలని పారుపెల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి లు కావాలనే తొలగించారని అన్నారు. పార్టీలో ఎవరు లేని కాలంలో కొంతకాలంగా దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉండి కార్యకర్తలకు అనుక్షణం అందుబాటులో ఉన్నారన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన నాయకుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ను అకారణంగా అతనిని పదవినుంచి తొలగించి, ప్రస్తుతం జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షునిగా ఉన్న నల్ల శ్రీరామ్ ను దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా నియమించడం సరికాదన్నారు. దేవరుప్పుల వాగు లోని ఇసుక, దేవునిగుట్ట మీద కళ్ళు పడ్డ కొందరు ఇసుకాసురులు, భూ బకాసురులు కలిసి చేసిన పన్నాగం ఇదన్నారు. గత మూడు నెలల పది రోజుల నుండి చనిపోయిన వారిని పరామర్షించి కొన్ని లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారన్నారు. ఇప్పటికే మండలంలో దళారులుగా మారిన కొందరు నాయకులు జీర్నించుకోలేక చేసిన పని ఇదని కార్యకర్తలు మండి పడుతున్నారు.మండలం లో చనిపోయిన వారిని పరామర్షించకూడదని,అక్రమ ఇసుక ఆపకూడదని చెప్పిన ఝాన్సి రాజేందర్ రెడ్డి రేపు రాబోయే కాలంలో దేవరుప్పుల మండలంలో ఎలా తిరుగుతారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులు భారీగా దేవరుప్పుల మండలకేంద్రంలోని జనగామ-సూర్యపేట రహదారి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు