జనగామ, జ్వాల :
జనగామ పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల 1988- 90 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్య విచ్చేసిన పూర్వ గురువులు ఫిజిక్స్ లెక్చరర్ ఎన్ సంజీవరెడ్డి మాట్లాడుతూ మూడున్నర దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకొని జీవిత మధుర ఘట్టాలను స్మరించుకోవడం అభినందనీయం అన్నారు. మీలాంటి విద్యార్థుల స్ఫూర్తి భావితరాలకు అందేలా సమాజహితం కోరే సేవా కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఇంటర్ కీలక విద్యను సద్వినియోగం చేసుకున్న ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తులో ఆశించిన రంగాలలో అగ్రభాగాన నిలుస్తారని అన్నారు. ఈ సందర్భంగా పూర్వ గురువు సంజీవ రెడ్డి విజయ దంపతులకు బంగారు ఉంగరం బహుకరించారు. అలాగే దేశ రక్షణతో పాటు జనగామ ప్రాంత ప్రజారోగ్య సురక్షణ కోసం విస్తృత సేవలు అందించిన కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి స్వరూపలను ఘనంగా సత్కరించి జ్ఞాపకం అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఆటపాటలతో చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇదే స్నేహాన్ని పరంపరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ మాచర్ల బిక్షపతి, యుగంధర్, రబ్బానీ, రవి, అస్నాల శ్రీనివాస్, నల్ల లక్ష్మీపతి, బొడ్డు వెంకన్న, బాను, శ్రీను, విజయరాణి, అనురాధ, కుగ్రా, అరుణ,పరీదా,లలిత, పర్జానా,లక్ష్మీ,అరుణ, లక్షపతి, బిక్షపతి,జనార్దన్, భాస్కర్, లింగం, అనిల్,నర్సయ్య, ఆంజనేయులు, రాజేందర్, శ్రీరామ్రెడ్డి, వీరన్న,శ్యామ్సుందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.